Latest News
గణేష్ నిమజ్జన శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్
03 Sep, 2025
37 Views
గణేష్ నిమజ్జన శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 03, (అవనిప్రతినిధి)ఈ నెల 6 వ తేదీన వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించే నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్,హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, లతో కలిసి బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలా పూర్ , చార్మినార్ సర్కిల్, మోజమ్ జాహి మార్కెట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగాపోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.విగ్రహాల ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాల పై అధికారులుతో మార్గమధ్యంలో ఆగుతూ చర్చించారు.ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతవాతవరణంలో జరిగేలా 30 వేల మంది పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి అయ్యేలా చూస్తామని అన్నారు.జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూగ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్ లతోపాటు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామన్నారు.
నగరంలోని అన్ని ప్రధాన లేక్ లలో 134 స్థిర క్రేన్ లు, 259 మొబైల్ క్రేన్ లు ఏర్పాటు చేశామన్నారు. 56,187 టెంపరరీ లైట్లు ఏర్పాటు చేశామన్నారు.హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, DRF టీం లను, 200 గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశామన్నారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీం లను డిప్లాయ్ చేశామన్నారు.వేడుకల్లో పారిశుద్ధ్యత కు పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టులలో రోజుకు 24 గంటలు పని చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఈ నెల 2 వ తేదీ వరకు వరకూ నగర వ్యాప్తంగా 1,21,905 గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగిందని .... ఈ నెల 6 వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. ఆ దిశగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం సజావుగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు.
బాలాపూర్ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న పోలీస్ కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు
బాలాపూర్ గణేష్ నిమజ్జనం శోభాయాత్ర మార్గంను పరిశీలించే ముందు కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు,హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్,హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన లు బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్నారు.వీరికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అధికారులకు నిర్వాహకులుస్వామి వారి కండువా వేసి, ప్రసాదం అందజేశారు.
బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్
కట్ట మైసమ్మ దేవాలయం → కేశవగిరి → చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ → మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ → ఇంజన్ బౌలి → అలియాబాద్ → నాగుల్చింత JN → హిమ్మత్పురా → చార్మినార్ → మదీనా ఎక్స్ రోడ్ → అఫ్జల్ గుంజ్ →MJ మార్కెట్ → అబిడ్స్ GPO →BJR విగ్రహం→ బషీర్బాగ్ X రోడ్ → లిబర్టీ → అంబేద్కర్ విగ్రహం →హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)
ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్
→ బడా గణేష్ → పాత పిఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ →తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం → హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)