Latest News
తెలంగాణ లో చంద్రబాబు పాలన నడుస్తుంది..
21 Jan, 2026
60 Views
తెలంగాణ లో చంద్రబాబు పాలన నడుస్తుంది..
- బి ఆర్ ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి విమర్శ.
సిద్దిపేట,జనవరి 21(అవనివిలేకరి)తెలంగాణ లో చంద్రబాబు పాలన నడుస్తుందని,హరీశ్ రావు పై ఎన్ని కుట్రలు పన్నిన కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తాడని బిఆర్ ఎస్ సిద్దిపేట పట్టణ శాఖ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, నాయకులు అరవింద్ రెడ్డి,తిరుమల్ రెడ్డిలు అన్నారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. హరీశ్ రావు పై ఎన్ని కుట్రలు పన్నిన కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తాడని వారు అన్నారు. తోక తల లేని ప్రశ్నలతో ప్రశ్నించే గొంతుకను ఆపలేరన్నారు. గతంలోనే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన ఇంకా బుద్ది రాలేదన్నారు. పెట్టుబడుల కోసం దావూస్ కి వెళ్ళిన ముఖ్యమంత్రి ఇటీవల హైదరాబాద్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఎంత పెట్టుబడి తీసుకొచ్చారని ప్రశ్నించారు. గ్లోబల్ ఐదు లక్షల పెట్టుబడి 5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని తెలిపారన్నారు. సీఎం ఎక్కడ ఖర్చు పెట్టారో తెలపాలన్నారు. హరీష్ రావు పై విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు మీరు ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ భయపడేది లేదన్నారు. సంక్రాంతి పండుగకు ఆంధ్ర వాళ్లకు ఉచిత టోల్గేట్ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు బస్ టికెట్ ను పెంచిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు తెలంగాణలో చంద్రబాబు విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు