మెదక్ జిల్లాలోని రామాయంపేట పరిధిలోని రహదారి తెగిపోయింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈరోజు ఉదయం రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.రామాయంపేట- సిద్దిపేట జాతీయ రహదారి NH 765 DG కోనాపూర్ వద్ద రోడ్డు తెగిపోవడం వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రోడ్డుపై ఎవరు ప్రయాణం చేయవద్దని అక్కడి గ్రామాల ప్రజలు ప్రయాణికులకు సూచిస్తున్నారు.